జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించే సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది.. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలన్న భర్తృహరి మోహతాబ్ సవరణకు అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ ఓటువేసింది.. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.. కాంగ్రెస్ వైఖరిపై టీఆర్ఎస్ ఎంపీ కవిత మండిపడ్డారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదని ఈరోజు తేలిపోయిందన్నారు.