వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్రపై విజయసాయి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడింది. ఇటీవల విజసాయి రెడ్డి సతీష్ చంద్రపై అసత్య ఆరోపణలు చేశారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం తప్పు పట్టింది అధికారులకు రాజకీయాలు అంటకట్టవద్దని హితవు పలికిన ఐఏఎస్ అధికారులు... పరిపాలన సజావుగా సాగాలంటే ఇలాంటివి మానుకోవాలని సూచించింది.