ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కోసం నిర్దేశించిన జీవో నెంబర్ 90ని కోర్టు కొట్టివేసింది. గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్ధానం మూడు నెలల్లో పంచాయతి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. గత వారం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇదే తరహాలో ఆదేశాలు జారీ చేసింది.