హర్యానాలో దారుణం జరిగింది. ఓ విద్యార్థి ఏకంగా స్కూల్ ప్రిన్సిపల్నే చంపేశాడు. ఈ ఘటన హర్యానాలోని యమునగర్లో జరిగింది. యమునగర్లో ఉన్న వివేకానంద స్కూల్లో 12 వ తరగతి చదువుతున్న స్టూడెంట్ అదే స్కూల్ ప్రిన్సిపల్ను తుపాకీతో కాల్చి చంపాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.