గుజరాత్ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పటేల్..!

Update: 2017-12-18 10:03 GMT

గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధించడంపై పటేల్ రిజర్వేషన్ పోరాటసమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేసారు.. గుజరాత్ లో బీజేపీ విపరీతమైయినా అధికార దుర్వినియోగానికి పాల్పడింది.. సగానికి పైగా జిల్లాలో బీజేపీ సభ్యులు రిగ్గింగుకు పాల్పడటమే కాకా ఈవీఎంల టాంపరింగుకు పాల్పడిందని వ్యాఖ్యలు చేసారు.. అసలు ఈ గెలుపు బీజేపీకి గెలుపేకాదన్న హార్దిక్, గుజరాత్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీయే నైతికంగా గెలిచిందన్నారు.. కాగా రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తరువాత కూడా పటేళ్ల ఉద్యమం కొనసాగుతుందని అయన స్పష్టం చేసారు.. అంతేకాదు ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచింతమాత్రానా వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటమి తప్పదని హార్దిక్ పటేల్ జోస్యం చెప్పారు.. 

Similar News