ఆఫీస్‌కి వచ్చి.. బాల్కనీ నుంచి దూకిన ఉద్యోగిణి

Update: 2018-06-28 10:11 GMT

హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మిలాంజ్‌ టవర్‌పై నుంచి దూకేసింది. మిలాంజ్‌ టవర్‌లో 9వ అంతస్తులోని ప్రైమ్‌ ఎరా మెడికల్‌ టెక్నాలజీ ఉద్యోగినిగా శ్రావణి విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఉదయం ఆఫీస్‌కి వచ్చిన శ్రావణి ... అనంతరం బాల్కనీ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. 

అయితే, శ్రావణి గత కొన్ని నెలలుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతుందని, మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చోందిన శ్రావణి... భర్త రామకృష్ణారెడ్డితో కలిసి మియాపూర్‌లోని మదీనాగూడలో నివాసం ఉంటుంది. శ్రావణికి ఒక బాబు కూడా ఉన్నాడు.

Similar News