అనుమానాస్పదరీతిలో జంట మృతి

Update: 2018-10-02 15:51 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ జంట అనుమానాస్పదరీతిలో మృతిచెందింది. పట్టణంలోని ఓ లాడ్జిలో బసచేసిన ఈ జంట… ఆదిలాబాద్‌ జిల్లా లింగాపూర్‌కు చెందినవారుగా తెలిసింది. ఆధార్‌కార్డు ఆధారంగా అందులో ఒకరు విష్ణువర్దన్‌గా గుర్తించారు. వారి నోట్లోంచి నురగలు వస్తుండడంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వాళ్లిద్దరూ ప్రేమికులా, దంపతులా అనే విషయం ఇంకా తెలియలేదు.

Similar News