వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తిలో దారుణం జరిగింది. పట్టణంలో నివాసముంటున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు. మృతులను గడ్డం దామోదర్, పద్మలుగా గుర్తించిన పోలీసులు .. ఆధారాల కోసం క్లూస్ టీంను రంగంలోకి దింపారు. దోపీడి దొంగలే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దోపీడియత్నాన్ని దంపతులు అడ్డుకోవడంతో వారిని దారుణంగా హతమార్చారని భావిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీమ్లు, డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దింపి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు.