స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో వాడివేడి వాదనలు

Update: 2018-11-07 09:46 GMT

అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ మరోసారి సమావేశమైంది. ఇప్పటికే 57 స్థానాలకు అభ్యర్థుల ఖరారు చేసిన కమిటీ మిగిలిన అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో సామాజిక సమీకరణాలు, బలాబలాలపై స్క్రీనింగ్‌ కమిటీ, ముఖ్యనేతలు కసరత్తు చేపట్టారు. ఆశావహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించే పనిలో పలువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రంలోపు అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రేపు జరిగే కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశంలో తుది జాబితా ఖరారు అయ్యే అవకాశం ఉంది.
 

Similar News