హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Update: 2018-04-17 08:24 GMT

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ  తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది.  అసెంబ్లీ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దుచేసిన హైకోర్టు ..వీరిద్దరిని ఎమ్మెల్యేలుగా   కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. 

Similar News