కర్ణాటకలో అధికారానికి కావలసిన మెజారిటీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ షాక్ లో మునిగిపోయింది. బీజేపీ డిప్యూటీ సీఎం అభ్యర్థి బి. శ్రీరాములు స్వల్ప తేడాతో ఓటమి చెందారు. సీఎం సిద్దరామయ్యపై పోటీకి దిగిన శ్రీరాములు 1000పైచిలుకు ఓట్లతో ఓటమి చవిచూశారు. కాగా శ్రీరాములు మరో నియోజకవర్గం మొలకల్ముర్ నుంచి పోటీ చేయగా సమీప కాంగ్రెస్ అబ్యర్ధిపై దాదాపు 6 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.