అవిశ్వాసం తీర్మాణం పెట్టి టీడీపీ ఏం సాధించింది..?: కృష్ణంరాజు

Update: 2018-07-23 10:16 GMT

అవిశ్వాసం కోసం 18 పార్టీల మద్దతు కూడగట్టాం అని చెప్పిన టీడీపీ పార్లమెంట్‌లో మాత్రం ఒక్క పార్టీతో కూడా ఏపీ సమస్యలపై మాట్లాడించలేకపోయారని కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. అవిశ్వాసం వల్ల దేశంలో మోడీకి ఉన్న విశ్వాసం ఎంతో తేలిపోయిందన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటిపై త్వరలోనే కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయబోతుందని తెలిపారు. మోడీపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీకి నివేదికలు పంపిస్తున్నట్లు కృష్ణంరాజు వివరించారు. 

Similar News