కోలీవుడ్‌ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఉపాసన!

Update: 2018-06-27 03:02 GMT

బుల్లితెర, అందాల పోటీలు, మోడలింగ్‌ రంగాలు వెండితెరకు వారధిగా మారుతున్నాయి. ముఖ్యంగా నటీమణులు అందాలపోటీల్లో కిరీటాలను గెలుచుకుని, మోడలింగ్‌ రంగంలో రాణిస్తూ సినీ కథానాయకిలుగా ప్రమోట్‌ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసిన బెంగాలీ బ్యూటీ ఉపాసన. ఈ మధ్యనే '88' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. '88' కంటే ముందే ఉపాసన 'ట్రాఫిక్‌ రామస్వామి' లో నటించింది. 

2015లో ఆల్‌ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని మిస్‌ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఉపాసన. దాదాపు 100 వాణిజ్య ప్రకటనల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విజయ్‌ టీవీలో ప్రసారం అయిన 'విల్లా టూ విలేజ్‌' కార్యక్రమం  ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

Similar News