తెలంగాణ ఎన్నికల కోసం ఏర్పాటైంది మహాకూటమి కాదని అది ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన మోడీ, రాహుల్, చంద్రబాబు కలిసే పనిచేస్తున్నారని వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ సర్కారు ముస్లీంలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలంగాణలో మత సామరస్యం ఉందన్నారు. గంగా జమునా తెహిజిమ్ సంస్కృతి మన ప్రాంతానికి సొంతమన్నారు.