టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆనం వివేకా కొన్ని రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఆనం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న ఆనం వివేకాను శుక్రవారం మంత్రి నారాలోకేష్ పరామర్శించారు.