వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్షంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందుకోసం ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగంలోకి దిగారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. అందులో భాగంగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్తో అమిత్షా భేటీ అయ్యారు. ముంబైలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకుగాను అమిత్షా ఒక్క రోజు పర్యటనకు మహారాష్ట్ర వచ్చారు. ఈ సందర్బంగా లతా మంగేష్కర్ ను కలిసి రానున్న ఎన్నికల్లో బీజేపీ తరుఫున ప్రచారం చేయాలని కోరారు. కాగా నాలుగేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఓ పుస్తకాన్ని ఆమెకు బహుకరించారు. ఇదిలావుంటే బీజేపీకి లతాజీ ప్రచారం చేస్తున్నట్టు అప్పుడే కొన్ని వెబ్సైట్లు దృవీకరిస్తున్నాయి.