సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తున్నారని సినీనటి ప్రియాంక మండిపడ్డారు. 'చాలా కోపంగా, ఇర్రిటేటెడ్గా ఉన్నా. యూట్యూబ్ చానల్స్కు ఏం పని పాటాలేదా. ఇప్పుడు చెప్పండి. మీకు నేను కనిపిస్తున్నానా. లేకపోతే దెయ్యంలా ఉన్నానా. మీ వ్యూస్, డబ్బు కోసం జనాల్ని చంపేస్తారా.మీరు నా గురించి పెట్టిన వీడియో డిలీట్ చేయండి. లేకపోతే ఆ వీడియో ఎవరు పెట్టారో తెలుసుకుని వేరే విధంగా చేయాల్సి ఉంటుంది. రేటింగ్స్ కోసం మీరు నేను చనిపోయానని పోస్ట్ చేసిన వీడియో మా కుటుంబసభ్యులు చూస్తే.. వారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఏదైనా చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయండి. ఇలాంటి వీడియోలు పెడితే మీకు భారీగా వ్యూస్ వస్తాయేమో గానీ, మా ఇళ్లల్లో పరిస్థితి అలా ఉండదని, అది ఫేక్ న్యూస్ అని అందరికీ చెప్పేసరికి తల ప్రాణం తోకకొస్తుందంటూ' ఆమె మండిపడ్డారు.