పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మహ్మద్ ఉస్మాన్ అలీ అనే నాలుగేళ్ళ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. యాకుత్పురా సెగ్మెంట్ తలాబ్కట్ట మహమ్మద్ నగర్ బస్తీకి చెందిన మహ్మద్ ఏజాజ్ ఆలీ, అంజూమ్ ఫాతిమాల కుమారుడు ఉమర్ అలీ స్థానిక పాఠశాలలో యుకేజీ చదువుకుంటున్నాడు. గురువారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఉమర్ అలీ శుక్రవారానికి శవమై తేలాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.