మద్యం మత్తు నిండుప్రాణాలను బలితీసుకుంటే కాపాడేందుకు వెళ్లేందుకు వెళ్లిన మరో వ్యక్తిని మృత్యువు కబళిలించింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ రోడ్డులో జరిగింది. అర్థరాత్రి హైవేపై వరుసగా ఐదు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఒకదాని తర్వాత మరోకటి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కోహెడకు చెందిన శ్రీశైలం, శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీస్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైదే అథాకిటీకి చెందిన కార్మికుడిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదాలకు మద్యం మత్తు, అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు.