చెన్నై నగరంలో ఘోరం..

Update: 2018-07-19 01:09 GMT

తమిళనాడు చెన్నై నగరంలో ఘోరం జరిగింది.  ప్రేమ పేరుతో బాలికను లోబరచుకున్న ఓ యువకుడు నయవంచన చేశాడు. పుదుచ్చేరికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన కార్మికుని కుమార్తె (17) చెన్నై నగరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబానికి  చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు విల్లుపురం జిల్లా వళుతావూరుకు చెందిన ఒక యువకుడు పరిచయం అయ్యాడు.  కొద్దీ కాలానికే వారిమధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మాయమాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ యువకుడు. అంతేకాకుండా తన ఆరుగురు స్నేహితులకు బాలికను అప్పగించగా వారూ కూడా రేప్ చేశారు.  విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Similar News