Stock Market: 61 వేల మార్కును దాటిన సెన్సెక్స్

Stock Market: 569 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ * 177 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

Update: 2021-10-14 11:34 GMT
Representational Image

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్న తరుణంలో ఈరోజు కొనుగోళ్ల జోరు కొనసాగింది. ముఖ్యంగా టెక్నాలజీ స్టాకులు దూకుడు ప్రదర్శించాయి. ఈ క్రమంలో మార్కెట్లు సరికొత్త రికార్డు స్థాయులను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 569 పాయింట్లు లాభపడి 61వేల 306కి ఎగబాకింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 18వేల 339కి చేరుకుంది.

Tags:    

Similar News