Stock Market: వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: 74.70 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
Stock Market: వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. దేశీయంగా కీలక రంగాల్లో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. దీంతో సూచీలు కొత్త గరిష్ఠాలను తాకాయి. 349.24 పాయింట్ల లాభంతో 73 వేల 57.40 వద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ సైతం 74.70 పాయింట్ల లాభంతో 22 వేల 196.95 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.96గా ముగిసింది.