Stock Market Today: ఇన్వెస్టర్లను గుల్ల చేస్తున్న స్టాక్ మార్కెట్..మళ్ళీ భారీ పతనం
Stock Market Today: ఇరాన్ యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ పతనం అవుతూనే వస్తోంది. ఈరోజు మరోసారి భారీ పతనంతో మార్కెట్ ముగిసింది.
Stock Market Today
Stock Market Today: వరుసగా పతనం అవుతూ వస్తున్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. గత వారాంతంలో భారీగా పతనమైన మార్కెట్ సూచీలు ఈ వారం ప్రారంభంలోనూ అదే ట్రెండ్ కనబరిచాయి. భారీ పతనంతో స్టాక్ మార్కెట్ వారం మొదలు పెట్టింది. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 1,066.36 పాయింట్లు పడిపోయి 72,516.86 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా, నిఫ్టీ 316.30 పాయింట్లు పడిపోయి 22,503.30 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు బ్యాంకింగ్, రియల్టీ, ఆటో స్టాక్లలో భారీగా అమ్మకాలు జరిగాయి.
ఇరాన్ యుద్ధం కారణంగా..
ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. దీని కారణంగా భారత స్టాక్ మార్కెట్ తీవ్ర పతనాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత స్టాక్ మార్కెట్ తీవ్ర పతనాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు కొరత, పెట్టుబడిదారుల దృష్టి ముడి చమురుపై కేంద్రీకృతమవ్వడమే దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
అంతేకాకుండా ముడి చమురు ధరలు బ్యారెల్కు 116 డాలర్లకు పెరిగాయి. ఇది కూడా మార్కెట్ పై ప్రభావం చూపించింది. దీంతో పాటు అమెరికా, ఆసియా మార్కెట్లలో పతనం కూడా మన మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని నిపుణులు చెబుతున్నారు. .
ఆసియా మార్కెట్లు కూడా..
- జపాన్ నిక్కీ సూచీ 3.60% పడిపోయి 51,433 వద్ద ట్రేడవుతోంది.
- దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.60% పడిపోయి 5,296 వద్ద ట్రేడవుతోంది.
- హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 1% పెరిగి 24,713 వద్ద ట్రేడవుతోంది.
- చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 3,922 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.
గత సెషన్ లో పడిపోయిన అమెరికా మార్కెట్..
గత వారాంతంలో అంటే మార్చి 27న డౌ జోన్స్ 793 పాయింట్లు (1.73%) పడిపోయి 45,166 వద్ద ముగిసింది. టెక్ ఆధారిత సూచీ అయిన నాస్డాక్ కాంపోజిట్ 2.15% పడిపోయి 20,948 వద్ద ముగిసింది. ఎస్&పి 500 సూచీ 108 పాయింట్లు (1.67%) పడిపోయి 6,368 వద్ద ముగిసింది.
ముడి చమురు 2% పెరిగింది..
ముడి చమురు ధరలు ఈరోజు 2% పెరిగి బ్యారెల్కు 116 డాలర్లకు చేరాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, ముడి చమురు ధరలు బ్యారెల్కు సుమారు 70 డాలర్లుగా ఉండేవి.