Union Budget 2025: గతంలో బడ్జెట్ ను ఇంగ్లీషులో ప్రవేశ పెట్టేవారు.. ఇప్పుడు హిందీలో కూడా..దీని ఎవరు ప్రారంభించారంటే..?
Union Budget 2025: భారతదేశంలో వలసరాజ్యాల కాలం నుండి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
Union Budget 2025: గతంలో బడ్జెట్ ను ఇంగ్లీషులో ప్రవేశ పెట్టేవారు.. ఇప్పుడు హిందీలో కూడా..దీని ఎవరు ప్రారంభించారంటే ?
Union Budget 2025: భారతదేశంలో వలసరాజ్యాల కాలం నుండి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి మోడీ ప్రభుత్వ మూడవ పదవీకాలంలో మొదటి పూర్తి బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఇందులో రాబోయే ఆర్థిక సంవత్సరం పూర్తి ఆర్థిక ఖాతా ఉంటుంది. కానీ దేశంలో ఇంతకు ముందు బడ్జెట్ను ఇంగ్లీషులో మాత్రమే ప్రవేశపెట్టేవారని, ఎప్పుడు హిందీలో ప్రవేశపెట్టేవరో, ఎవరు ప్రవేశపెట్టారో ఈ కథనంలో తెలుసుకుందాం.
బడ్జెట్ చరిత్ర ఇంగ్లీషులో
ప్రారంభం నుంచి బడ్జెట్ను ఇంగ్లీషులోనే ప్రవేశపెడుతున్నారు. భారతదేశంలో మొదటి బడ్జెట్ 1860లో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో దీనిని ఇంగ్లీషులో మాత్రమే చదివేవారు. దీని తరువాత బడ్జెట్ సమర్పించే సంప్రదాయంలో అనేక మార్పులు వచ్చాయి. భారతదేశపు మొట్టమొదటి బడ్జెట్ను 1860 ఏప్రిల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ సమర్పించారు. అయితే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఆర్థిక నిపుణుడు ఆర్.కె. షణ్ముఖం చెట్టి నవంబర్ 26, 1947న బడ్జెట్ను సమర్పించారు. బ్రిటిష్ పాలనలో బడ్జెట్లో పన్నుకు ఎటువంటి నిబంధన లేదు. కానీ స్వాతంత్ర్యం తర్వాత, ఆగస్టు 15, 1947 నుండి మార్చి 31, 1948 వరకు, బడ్జెట్లో పన్ను వ్యవస్థను అనుసంధానించడానికి అనేక సిఫార్సులు చేశారు.
హిందీలో బడ్జెట్ చదివే సంప్రదాయం
1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత, హిందీని భారతదేశ అధికారిక భాషగా గుర్తించారు. అప్పటి నుండి వివిధ ప్రభుత్వ పనులలో హిందీ వాడకం పెరగడం ప్రారంభమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా.. 1955 సంవత్సరం వరకు, బడ్జెట్ను ఇంగ్లీషులోనే ప్రవేశపెట్టారు. కానీ దీని తర్వాత దీనిని హిందీలో కూడా ప్రదర్శించడం ప్రారంభించారు. ఈ మార్పులో అప్పటి ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ అయిన సిడి దేశ్ముఖ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆగస్టు 11, 1943న బ్రిటిష్ ప్రభుత్వం సిడి దేశ్ముఖ్ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమించింది. ఆయన ఈ పదవిలో జూన్ 30, 1949 వరకు కొనసాగారు.