Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో షురూ..

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్‌ 251 పాయింట్లు కోల్పోయింది.

Update: 2021-04-23 04:29 GMT

స్టాక్ మార్కెట్ కదలికలు (ఫైల్ ఫొటో)

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్‌ 251 పాయింట్లు కోల్పోయి 47,829 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 14,338 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిసిన నేపధ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.మరోవైపు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా సెషన్ లో మార్కెట్లు బలహీన ధోరణిన కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News