Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: *20 పాయింట్లు కోల్పోయి 58,786కు పడిపోయిన సెన్సెక్స్ *5 పాయింట్లు నష్టపోయి 17,511 దగ్గర స్థిరపడిన నిఫ్టీ
Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల జోరుకు ఇవాళ బ్రేక్ పడింది. ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 20 పాయింట్లు కోల్పోయి 58వేల 786కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 17వేల 511 దగ్గర స్థిరపడింది.