స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా బాధితులతో ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం ట్రెడింగ్ ఆరంభంలో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో లాభపడి మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 810 పాయింట్లు నష్టపోయి.. 30వేల 579 వద్ద ముగిసింది. నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయి 8వేల 967 వద్ద ముగిసింది.