Petrol Rate: మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరం
Petrol Rate: గత 23 రోజులుగా నిలకడగా పెట్రో ధరలు
Representational Image
Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో గత 23 రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా నిలకడగా కొనసాగుతున్నాయి. గత ఫిబ్రవరి 27 న పెట్రో ధరలను సవరించగా అప్పట్నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటర్ కు 4 రూపాయల 87 పైసలు డీజిల్ 4 రూపాయల 99 పైసల మేర పెరిగింది.
రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 17 పెసల వద్ద స్థిరంగా కొనసాగుతుండగా ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల 57 పైసల వద్దకు చేరింది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు ఏపీలోని మెట్రో నగరాల్లో 97 రూపాయల 24 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.