బంగారం ధర మళ్లీ పెరిగింది!

Update: 2019-09-17 03:01 GMT

కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం సోమవారం స్వల్పంగా పెరిగింది. అయితే, మంగళవారం ఒక్కసారే పైకి ఎగసింది. దాదాపు 24 క్యారెట్ల బంగారం ధర 410 రూపాయల వరకూ పెరిగింది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా 40 రూపాయల్ మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 410రూపాయలు పెరిగి 39,510 రూపాయలుగా నిలిచింది. అదేసమయంలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 410రూపాయల పెరుగుదలతో 36,260రూపాయలకు చేరింది. ఇక మార్కెట్ లో వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర 40 రూపాయలు పెరిగి, 48,800రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 290రూపాయలు పెరిగి 38,100రూపాయల వద్ద ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 390రూపాయల పెరుగుదలతో 37,000రూపాయలకు పెరిగింది. కేజీ వెండి ధర 40 రూపాయలు పెరిగి 48,800 రూపాయలకు చేరింది. అయితే, గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర దిగివచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.29శాతం తగ్గి 1,506.45 డాలర్లకు దిగింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.43 శాతం క్షీణించి 17.95 డాలర్లకు దిగొచ్చింది.


Tags:    

Similar News