అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు అసెంబ్లీ మరోసారి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2020-06-16 13:21 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు మరోసారి ఆమోదం పొందాయి. దాంతో మూడు రాజధానుల ప్రక్రియ మళ్ళీ మొదటికొచ్చింది. ఈసారి చర్చ లేకుండానే బిల్లులు ఆమోదం పొందాయి. అయితే ఈ బిల్లులను మరోసారి మండలికి పంపుతారు. ఒకవేళ మండలిలో ఈసారి ఆమోదం పొందకపోయినట్టయితే నెలరోజుల తరువాత ఇది ఆటోమాటిక్ గా ఆమోదం పొందుతుందని రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.

కాగా జనవరిలో ఈ రెండు బిల్లులను అసెంబ్లీ అమోదించింది. అయితే కౌన్సిల్ లో టీడీపీ అడ్డుకోవడం, పైగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం వంటివి జరిగాయి. ఆ తరువాత మూడు రాజధానుల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పరిణామాలతో వైసీపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ పార్లమెంటుకు తీర్మానం పంపించింది.


Tags:    

Similar News