వచ్చే నెల 10న అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ పధకం కింద విద్యార్థులతో పాటు ప్రతిఒక్కరికి ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో పెద్దిరెడ్డి చర్చించారు. వైఎస్సార్ కంటి వెలుగు పధకం ప్రారంభం సందర్బంగా ఏర్పాటు చేసే బహిరంగా సభ గురించి కూడా ఆయన చర్చించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని.. అక్టోబర్ 2 నుంచి ఈ వ్యవస్థ ప్రారంభమవుతుందన్నారు. రేపు(సోమవారం) ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు.