వైఎస్సార్‌కు కుటుంబసభ్యుల నివాళులు

Update: 2020-09-02 04:39 GMT

YSR 11th Death Anniversary: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. జగన్‌తో పాటు కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు, అభిమానులు వైఎస్సార్‌కు నివాళులర్పించారు.

Tags:    

Similar News