చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రీస్టార్ట్ పాలసీ కింద 905 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా పరిశ్రమలశాఖ విధి విధానాలను ఖరారు చేసింది.
* ఎంఎస్ఎంఈలకు పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలను రెండు విడతలుగా చెల్లింపు.
* ఈ ఎడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు స్థిర డిమాండ్ ఛార్జీల రద్దు.
* ఈ ఏడాది ఫిబ్రవరికి ముందున్న ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్ పాలసీ వర్తింపు
* రీస్టార్ట్ పాలసీ వినియోగించుకునేందుకు జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి
* 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచే ప్రభుత్వ కొనుగోళ్లకు నిర్ణయం
* రూ.2 నుంచి 10 లక్షల వరకు 6-8శాతం వడ్డీకే రుణ సౌకర్యం