వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక మలుపు..ముగ్గురినీ గుజరాత్‌..

Update: 2019-07-30 12:10 GMT

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అనుమానితుడు కసనూరు పరమేశ్వర్‌రెడ్డిని మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు డీఎస్పీ కార్యాలయంలో ప్రశ్నించారు. అయితే, పరమేశ్వర్‌రెడ్డికి నార్కో పరీక్ష జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేయడంతో పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పరమేశ్వర్‌రెడ్డితోపాటు ఇప్పటికే కోర్టు అనుమతిచ్చిన రంగన్న, ఎర్ర గంగిరెడ్డిని నార్కో అనాలసిస్ పరీక్ష కోసం గుజరాత్‌కి తరలించారు. 

Tags:    

Similar News