Jagan: సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
Jagan: ఉగాది సందర్భంగా ఆశీర్వాదాలు అందించిన పండితులు
Jagan: సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
Jagan: ఉగాది సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం జరిగింది. శాలువా కప్పి, అక్షింతలు చల్లి పండితులు సీఎం జగన్ దంపతులకు ఆశీర్వాదం ఇచ్చారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.