తిరుమలలో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య!
తిరుమలలో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య! తిరుమలలో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య!
తిరుమలలో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సుపథం ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి మూడురోజుల క్రితమే మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుర్తుతెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా చంపి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.