రమణదీక్షితులకు గౌరవ ప్రధాన అర్చకుడి హోదా కల్పిస్తూ టీటీడీ తీర్మానం

Update: 2019-12-28 11:13 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో రమణదీక్షితులకు గౌరవ ప్రధాన అర్చకుడి హోదా కల్పిస్తూ తీర్మానం చేశారు.

ప్రస్తుతం ఉన్న నలుగురు అర్చకులు అదే విధంగా ఉంటారని రమణ దీక్షీతులు అనుభవంతో ఆగమ సంప్రదాయల పట్ల మిగతా అర్చకులకు సలహాలు ఇస్తారని టీటీడీ వెల్లడించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ను మూడు వేల 243.19 కోట్లకు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని రెండు ఘాట్ రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు పది కోట్లు, ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 30 కోట్ల నిధులు మంజూరు చేశారు.  

Tags:    

Similar News