టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా విడుదల చేస్తూ జీవో
టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా విడుదల చేస్తూ జీవో
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యుల జాబితా జీవో విడుదల అయింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జిఓను విడుదల చేశారు. టీటీడీ చైర్మన్, పాలకమండలి సభ్యులు, ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 29 మందిని చేరుస్తు ఆర్డినెన్స్ తెచ్చింది ప్రభుత్వం. ఇందులో ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరావు, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధా నారాయణ మూర్తి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి. యలమంచిలి ఎమ్మెల్యే యువి రమణ మూర్తిరాజు(కన్నబాబురాజు), రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పెనమలూరు ఎమ్మెల్యే కే పార్ధసారధి తదితరులకు చోటు దక్కింది.
ఆంధ్రప్రదేశ్ -
1.వి.ప్రశాంతి
2.యువి రమణ మూర్తిరాజు(కన్నబాబురాజు) (MLA)
3.మేడా మల్లికార్జున రెడ్డి (MLA)
4.గొల్ల బాబూరావు (MLA)
5.నాదెండ్ల సుబ్బారావు
6.డిపి అనంత
7.చిప్పగిరి ప్రసాద్ కుమార్
8.కె.పార్థసారథి (MLA)
తెలంగాణ -
1.జూపల్లి రామేశ్వరరావు
2.బి.పార్థసారథి రెడ్డి
3.యు.వెంకట భాస్కర రావు
4.మూరంశెట్టి రాములు
5.డి.దామోదర్ రావు
6.కె.శివ కుమార్
7.పుత్తా ప్రతాప రెడ్డి
తమిళనాడు -
1.కృష్ణమూర్తి వైద్యనాథన్
2.ఎస్.శ్రీనివాసన్
3.డాక్టర్ నిచితా ముత్తువరపు
4.కుమారగురు (MLA)
కర్ణాటక -
1.రమేష్ శెట్టి
2.సంపత్ రవి నారాయణ
3.సుధా నారాయణ మూర్తి
ఢిల్లీ -
1.ఎం ఎస్ శివ శంకరన్
మహారాష్ట్ర -
1.రాజేష్ శర్మ
ఎక్స్ అఫీషియో -
1.చైర్మన్ (TUDA)
2.SPL CS
3.కమిషనర్ ఎండోమెంట్స్
4.E.O. (TTD)