జిల్లాలో 20 మంది ఎంపీడీవోల బదిలీ

Update: 2020-01-09 06:55 GMT

కడప: జిల్లాలోని పలువురు ఎంపీడీవో లను బదిలీ చేస్తూ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుధాకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా చెన్నూరు లో ఏవో గా ఉన్న శ్రీనివాసులు చాపాడుకు, కడప జడ్పీ లో ఉన్న ఏవో నరసింహులు ను సంబేపల్లెకు, సంబేపల్లె ఈ ఓ పి ఆర్ డి నరసింహులు రామాపురంకు, మైలవరం ఏవో వెంకట రమణయ్య ను పెద్దముడియం, ఒంటిమిట్ట ఏవో సుజాతమ్మ ను అట్లూరుకు, గాలివీడు ఏవో హైదర్ ఆలీని చక్రాయపేటకు, ముద్దనూరు ఈవోపీఆర్డీ కృష్ణయ్యను ఒంటిమిట్టకు, కలసపాడు ఈవోపీఆర్డీ జాన్ వెస్లీ ని అక్కడ ఎంపీడీవోగా నియమించారు.

శ్యాంసున్ చిట్వేలు, వరప్రసాద్ పెనగలూరుకు, కృష్ణమూర్తి సింహాద్రిపురం, ఈవోపీఆర్డీ గా ఉన్న జోస్లిన్ మైలవరం, చంద్రశేఖర్ ను గోపవరం, ఆజంఖాన్ ను కమలాపురం, పీ వి సుబ్బారెడ్డి జమ్మలమడుగు, ఉమామహేశ్వరరావు బి కోడూర్ కు, మధుసూదన్ రెడ్డి నీ తొండూరుకు, మహబూబ్ ఖాన్ ను రైల్వేకోడూరు కు, అయ్యన్న రాయచోటికి, రూప్ కుమార్ ను కాశి నాయన మండలాలకు ఎంపీడీవోలు గా నియమించారు. 

Tags:    

Similar News