తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు తెలిపారు. దర్శనానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా... టైం స్లాట్, దివ్య దర్శనాలకు 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇదిలావుంటే టీటీడీ పాలకమండలి సభ్యులను బుధవారం లేదా శనివారం సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా సిపారసులు అందాయి.