Visakha: విశాఖ వేదికగా టైగర్ ట్రయంఫ్- 24 కార్యక్రమం
Visakha: స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు కార్యక్రమం
Visakha: భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయంఫ్-24 విశాఖతూర్పు నౌకాదళం వేదికగా కొనసాగుతోంది. ఈ నెల 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో.. ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో భారత్ తరఫున హెలికాప్టర్లతో కూడిన యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, సైనిక దళాలు, వైమానిక దళానికి చెందిన విమానాలు పాల్గొంటాయి. అమెరికా తరఫున నేవీ నౌకలు, మెరైన్ బృందాలు, సైనిక దళం పాల్గొంటున్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల నేవీ అధికారులు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.