Nandamuri BalaKrishna: రాయసీమలో ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు
Nandamuri BalaKrishna: రాయసీమలో ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు
Nandamuri BalaKrishna: వైసీపీ ప్రభుత్వంపై సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని పరిశ్రమలను తరమేస్తున్నారన్నారు. రాయసీమలో ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమలు తీసుకొస్తామని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం సరస్వతీ విద్యా మందిర్లో కంప్యూటర్లను బాలకృష్ణ పంపిణీ చేశారు.