Purandeswari: ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా ముందుకెళ్తాం

Purandeswari: పొత్తులో వచ్చిన సీట్ల ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేశారు

Update: 2024-03-26 16:41 GMT

Purandeswari: ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా ముందుకెళ్తాం

Purandeswari: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా కూటమిలోని పార్టీలతో సమన్వయం చేసుకుని వెళతామన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల కారణంగానే పొత్తు పొట్టుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూటమి తరపున ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై పదాధికారుల సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఇక త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను నియమిస్తామన్నారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లలోనే అభ్యర్థులకు ఎంపిక చేశారన్నారు. అభ్యర్థుల ఎంపికపై హైకమాండే నిర్ణయం తీసుకుందన్నారు పురందేశ్వరి. పొత్తులో భాగంగా విశాఖ సీటు రాలేదని..తనపై ఆరోపణలు చేసే వారి గురించి స్పందించాల్సిన అవసరంలేదన్నారు పురందేశ్వరి.

Tags:    

Similar News