త్రిమూర్తులను బుజ్జగిస్తున్న టీడీపీ.. ఈనెల 18న వైసీపీ..

త్రిమూర్తులను బుజ్జగిస్తున్న టీడీపీ.. ఈనెల 18న వైసీపీ.. త్రిమూర్తులను బుజ్జగిస్తున్న టీడీపీ.. ఈనెల 18న వైసీపీ..

Update: 2019-09-13 08:33 GMT

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు పార్టీ మారడం ఖాయమైంది. రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన తన కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. సమావేశంలో ఈనెల 18 సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనను ఆపేందుకు టీడీపీ అధిష్టానం దూతగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను రంగంలోకి దింపింది. నెహ్రూ.. త్రిమూర్తులతో భేటీ అయి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం పార్టీ మార్పుపై వెనక్కి తగ్గలేదు. దీంతో నెహ్రూ వెనుదిరిగినట్టు తెలుస్తోంది. త్రిమూర్తుల తోపాటు ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి రాజీనామా చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే జిల్లాకు చెందిన పత్తిపాడు ఇంచార్జ్ వరుపుల రాజా టీడీపీకి రాజీనామా చేశారు.త్రిమూర్తులను బుజ్జగిస్తున్న టీడీపీ.. ఈనెల 18న వైసీపీ..

 

Tags:    

Similar News