టీడీపీలోనే ఉంటా, పార్టీ మారే ఆలోచన లేదు : డొక్కా

Update: 2019-10-17 10:40 GMT

మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ప్రభుత్వం చీకటి ఆలోచనలు చేస్తోందన్న డొక్కా మీడియాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటన్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అయితే తనకు పార్టీ మారే ఆలోచన లేదని, టీడీపీలోనే ఉంటానని డొక్కా క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్ళాలనిపిస్తే చెప్పే వెళ్తానని డొక్కా మాణిక్య వర ప్రసాద్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News