ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒకరి తర్వాత మరికొరు కీలకనేతలంతా పార్టీని వీడుతున్నారు. కాగా ఈ జాబితాలో పరిటాల కుటుంబం కూడా చేరిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వాటిపై పరిటాల శ్రీరామ్ స్పందించారు. టీడీపీని వీడుతున్నారంటూ వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆయన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయని పార్టీ మారుతున్నట్లు కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన శ్రీరామ్ టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
'తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయని పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్బ్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాన్న పరిటాల రవీంద్ర గారి సిద్ధాంతాలతో ఆయన ఆశయసాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్రజాభివృద్ధిని కాంక్షిస్తూ నిత్య ప్రజాసేవలో కొనసాగుతున్నాం. అలాంటి మా మీద కన్నతల్లి లాంటి పార్టీ మారుతున్నట్లు తీవ్రమైన దుష్ప్రచారాన్ని చేస్తున్న మూర్ఖులు అందరికీ ఒక్కటి మాత్రం చెప్పగలం.. పసువు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన మాకు రాదు రాబోదు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే కుసంస్కృతి మాకు లేదు.. తరాలు మారినా తరగని అభిమానంతో పసుపు జెండా కోసం పని చేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. ఇకనైనా ఇలాంటి రాతలు రాసే వారు నీతి మాలిన రాతలు మాని సమాజంలో నీతిగా బతకండి..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Official statement... @TV9Telugu @TV9Telangana @Abnandhrajyothi @tv5newsnow @ncbn @naralokesh @RamMNK @JaiTDP @BangaloreTDP @atpdist_tdp @krishna_tdp @AnuradhaTdp @kesineni_nani @DevineniUma pic.twitter.com/FXBWgLuLFe
— Paritala Sreeram (@IParitalaSriram) March 15, 2020