సోషల్ మీడియా అంటే భయం.. నన్ను కూడా అరెస్ట్ చేయండి

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయకార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.

Update: 2020-05-23 11:22 GMT
Nara Lokesh (File Photo)

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయకార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. టీడీపీ సోషల్ మీడియా వాలంటీర్లు, కార్యకర్తలపై ప్రభుత్వం కక్షసాధిస్తోందన్నారు. మొన్న గుంటూరుకు చెందిన రంగనాయకమ్మపై సీఐడీ కేసు.. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన సత్యం రెడ్డి అనే కార్యకర్తను అరెస్ట్ చేయడంపై ట్విట్టర్ వేదికగా విమర్శించారు. రంగనాయకమ్మ చేసినట్లు తనాన్ని అరెస్ట్ చేయాలన్నారు.

"సోషల్ మీడియా అనగానే వైఎస్ జగన్ గారి వెన్నులో వణుకు మొదలవుతుందన్నారు లోకేష్. అసమర్థ పాలన సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తుంది అనే భయం ఆయనను వెంటాడుతోందన్నారు. రంగనాయకమ్మ గారు పెట్టిన పోస్టునే తాను కూడా పెడుతున్నానని.. తనను కూడా అరెస్ట్ చేయాలన్నారు నారా లోకేష్.'' ఆమె పెట్టిన పోస్ట్‌ను లోకేష్ కూడా ట్వీట్ చేశారు.




Tags:    

Similar News