ఆ కీలకనేత టీడీపీకి రాజీనామా చేస్తారా!

ఆ కీలకనేత టీడీపీకి రాజీనామా చేస్తారా! ఆ కీలకనేత టీడీపీకి రాజీనామా చేస్తారా!

Update: 2019-09-17 04:44 GMT

ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తమ్ముడు బేబీ నాయనను బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బేబినాయనతో బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో బలమైన నేతకోసం వెతుకుతున్న బీజేపీ.. రంగారావు కుటుంబంపై ఫోకస్ పెట్టింది. మొదట సుజయ్ కృష్ణను సంప్రదించగా ఆయన అనాసక్తితో ఉన్నారట.. ఈ క్రమంలో టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న తన తమ్ముడు చిన్నరాజాగా పేరుగాంచిన బేబీ నాయనతో మాట్లాడగా చేరతానని కానీ చేరనని కానీ చెప్పకుండా ఆలోచించుకొని చెబుతానని చెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఇప్పుడు కాకపోయినా రెండు మూడు నెలల్లోనైనా బేబీ నాయన బీజేపీలో చేరడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా 2014 లో విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బేబినాయన టీడీపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత టీడీపీలో చేరినా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. అయితే ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీలో చేరాలని బేబినాయన ప్రయత్నించినట్టు ప్రచారం జరిగింది.. కానీ కుదరకపోవడంతో టీడీపీలోనే ఉన్నారు. తాజాగా బీజేపీ నేతలు ఆయనను సంప్రదిస్తున్న వేళ బేబినాయన బీజేపీలో చేరతారా లేక టీడీపీలోనే ఉంటారా అన్నది మరికొద్దిరోజుల్లో తేలనుంది. 

Tags:    

Similar News