నన్ను ముట్టుకోవద్దు.. అచ్చెన్నాయుడు..

Update: 2019-09-11 04:45 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన 'ఛలో ఆత్మకూరు'కు పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకున్నారు. విజయవాడలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులను అచ్చెన్న హెచ్చరించారు. నన్ను ముట్టుకోవద్దు అంటూ వారిపై మండిపడ్డారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ లాంటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని.. అధికారంలో ఉండి బాధితుల శిబిరాన్ని ఏర్పాటు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై జనం నవ్వుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

Tags:    

Similar News