విజయవాడలో టీడీపీ జయహో బీసీ సదస్సు
Vijayawada: 11 గంటలకు కేంద్ర కార్యాలయంలో సదస్సు
విజయవాడలో టీడీపీ జయహో బీసీ సదస్సు
Vijayawada: బీసీలు బలహీనులు కాదు.. బలవంతులు అనే నినాదంతో టీడీపీ జయహో సదస్సును నిర్వహిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది. జయహో బీసీ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీసీ రథాలను ప్రారంభించి.. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారాలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.